Monday, January 23, 2012

సూర్య గ్రహంలో ఏర్పడిన పేళ్ళుల్లు భూమి ఉపరితలాన్ని ఈ రోజు తాకే అవకాశం...ఫోటోలు

ఈ నెల 22 వ తారీఖున సూర్యగ్రహంలో ఏర్పడిన పేళ్ళుల్ల ఫోటోలను నాసా వారు విడుదల చేసేరు. 6 సంవత్సరాలలో సూర్యగ్రహంలో ఏర్పడిన పేళ్ళుల్లు ఇంత పెద్దవిగాలేవని తెలుపుతూ, ఈ పేళుల్ల వలన ఏర్పడిన జియో మాగ్నటిక్ తుఫాన భూమియొక్క ఉపరితలాన్ని తాకే అవకాశం ఉందని, ఇప్పటికే దాని తాకిడి వలన ఏర్పడిన రేడియేషన్ భూమి యొక్క ఉపరితలం మీద ప్రభావం చూపుతోందని, ఈ తాకిడి ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున సెటిలైట్లు,విమాన దారులూ మరియూ విధ్యుత్ కేంద్రాలూ దెబ్బతినే అవకాశం ఉన్నదని తెలిపేరు.

సూర్యగ్రం నుండి వెలువడిన సౌర భస్మమము గంటకు 5 మిల్లియన్ మైళ్ల వేగంతో వస్తున్నదని, ఇది మామూలుగా సౌరగ్రహం నుండి వచ్చే సౌర్ భస్మమం వచ్చే వేగానికన్నా 5 రెట్లు ఎక్కువగా ఉన్నదని తెలిపేరు. అందువలన నార్త్ పోల్ కు దగ్గరున్న నార్త్ అమెరికా, యూరప్ మరియూ ఏసియా ఖండాలలో విమానాలకూ, కమ్యూనికేషన్స్ కూ, విధ్యుత్ కేంద్రాలకూ అంతరాయం కలగవచ్చు గనుక విమానాలను వేరే దార్లలో మళ్ళించవలసిందిగా హెచ్చరించేరట. అంతరిక్షంలో ఉన్న స్పేస్ లాబ్ ను దిస మార్చుకోవలసినదిగా సూచించేరట.

నాసా వారి అంతర్జాతీయ వాతావరణ కేంద్రం ఇచ్చిన హెచ్చరికలో సౌర తుఫాన తాకిడి 3 నుండి 5 స్కేల్ మీద ఉంటుందని, తాకిడి 24(25)తెల్లవారుఝామున ఉండవచ్చునని ఆ టైములో జి.పి.ఎస్ లు కూడా పనిచేయకపోవచ్చునని తెలిపేరు.





0 comments:

Post a Comment