Friday, March 16, 2012

పేరుపొందిని 10 బ్రాండ్స్....వీడియో

3 దేశాలను సరిహద్దులో కలుపుతున్న 2 నదులు...ఫోటోలు

సరిహద్దులలో 3 దేశాలు కలవడమనేది ప్రపంచంలో చాల చోట్ల ఉన్నది.కానీ 2 నదులు 3 దేశాల సరిహద్దులను కలపడం ఇక్కడ మాత్రమే జరిగింది. పరణా నది మరియూ ఇగువాజూ నది, ఈ రండూ కలిసి 3 దేశాలను సరిహద్దులలో కలుపుతోంది.

ఇది ఒక ముఖ్యమైన టూరిస్ట్ ప్రదేశం.ఇక్కడికి వచ్చే టూరిస్ట్ లు అర్జెంటీనా దేశాన్నీ బ్రిజిల్ దేశాన్ని కలిపే అంతర్జాతీయ వంతెనను చూడవచ్చు.ప్రతిదేశ సరిహద్దులోనూ ఓబ్లిసిక్ స్థంభం ఒకటి ఉంటుంది. ఆయా దేశాలు వారు పెట్తిన స్థంభాలకు వారి దేశ జాతీయ రంగులు వేసుంటారు.అక్కడ నిలబడి 3 దేశాలనూ చూడవచ్చుట.








బట్టలు ఆరేయడంలో కూడా ఒక కళ...ఫోటోలు

ఫిన్లాండ్ లో జీవిస్తున్న కారీనా కైక్కోనన్ అనే ఆమె లాండరీ షాప్ పెట్టుకుని వ్యాపారంచేస్తోంది. ఆమె షాపుకు డ్రైక్లీనింగ్ కి వచ్చిన బట్టలను ఆరవేయడాన్ని ఒక కళగా తీసుకున్నది. ఆమె ఒక పద్దతిలో బట్టలు ఆరవేస్తుంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయేరు. ఇందులో కూడా ఒక కళ ఉందా అని విస్తుపోయేరు. ఆమె బట్టలు ఆరవేసిన విధానాన్ని చూడటానికి అక్కడకు ప్రజలు వస్తారట. వారుకూడా వారి ఇళ్ళల్లో అమె పద్దతిని వాడుతారట.












Thursday, March 15, 2012

పాత గడియారాలతో తయారుచేసిన బొమ్మలు...ఫోటోలు











"బ్లాక్ మనీ" వివరాలు...స్విస్ బ్యాంక్ ఉత్తరం…?......ఫోటొ

ఈ లెటర్ ఎంతవరకు నిజమైనదో తెలియదు. భారత ప్రభుత్వానికి పంపబడ్డదని చెప్పబడుతున్న ఈ లెటర్ లో 10 మంది ప్రముక వ్యక్తుల పేర్లు మరియూ వారు దాచుకున్న సొమ్ము వివరాలు ఇవ్వబడాయి. ఈ లెటర్ నిజం అయ్యుండదనీ చెప్పలేము. ఎందుకంటే ఈ లెటర్లో ఉన్న ప్రముక వ్యక్తులు బ్లాక్ మనీ దాచుకోరు అని చెప్పలేము గనుక. ఈ లెటర్లో మన గమనించవలసిన మరో ముఖ్య విషయం ఒకటుంది. ఈ లెటర్ చివర్లో విదేశీయులు వారి బ్యాంక్ లో దాచుకున్న మొత్త డబ్బు(3,364 బిల్లియన్ డాలర్లు)లో 56 శాతం భారతీయలదేనని సూచించేరు. అంటే ఈ లెటర్లో చెప్పబడిన ప్రముకులే కాకుండా మరింకెందరో అక్కడ బ్లాక్ మనీ దాచుకున్నారు.

‘బ్లాక్ మనీ’..ఈ పదం ఈ మద్య బాగా పాపులర్ అయింది. భారత దేశం తరచూ ఈ పదంతోనే వార్తల్లో నిలుస్తోంది. కారణం మన రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, కొందరు బిజినెస్ మ్యాన్స్ అక్రమంగా సంపాదించిన డబ్బును స్విస్ బ్యాంకుల్లో దాచుకోవడమే. విదేశాలలో దాగిన నల్ల ధనంపై ముందు ఖచ్చితమైన సమాచారం ఉండాలని, ప్రతిపక్షాలు పాతిక లక్షల కోట్లు అంటే అవును, పాతిక లక్షల కోట్లు అని పునరుద్ఘాటించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఒకప్పుడు చెప్పారు.

నల్ల ధనానికి సంబంధించి ఇప్పటికే ఏయే దేశాలలో ఆ నల్లధనం దాచుకున్నారని ఆరోపణలు వస్తున్నాయో ఆయా దేశాలతో మాట్లాడుతున్నామని ఆయన వివరించారు. వివిధ దేశాలతో ఉన్న ఒప్పందాల ప్రకారమే ఏదైనా జరగాలని, మనం వివాదాలకు తావు లేని విధంగా విశ్వసనీయ సమాచారాన్ని సేకరించి ఇవ్వగలిగితే అందరం కలిసి ఈ సమస్యను పరిష్కరించవచ్చునని ఆయన అన్నారు. స్విట్జర్లండ్తోనూ, ఫ్రాన్స్తోనూ కూడా ఈ అంశంపై మాట్లాడామని ఆయన గుర్తు చేశారు.

నల్ల ధనం అనేది దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తున్నదనే అంశంలో వివాదానికి తావు లేదు. ఈ నల్ల కుబేర వ్యవస్థను ప్రభుత్వమే నిర్వీర్యం చేయాలి.

భారత ప్రభుత్వాన్ని మోసం చేసి విదేశాలలో వందలాది కోట్లు దాచుకున్న వారి పేర్లను ప్రభుత్వమే బయటపెట్టా లి . అసలు దేశం మొత్తం మీద ఎంత మొత్తం నల్లధనంగా మారిందో, ఎంత మొత్తం ఇలా విదేశాలకు తరలిపోయిందో, ఇకముందు ఇలా జరగకుండా ఉండడానికి ప్రభుత్వం ఏం చేయదలుచుకుందో ప్రభుత్వం ప్రజలకు సవివరంగా చెప్పాలి.

ఈ రోజు ఈ సంవత్సరానికి గానూ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇందులో విదేశీయ బ్యాంకులలో దాగియున్న "బ్లాక్ మనీ" గురించి ప్రభుత్వం ఏమిచేయదలుచుకుందో చెబుతారేమో వేచి చూడాలి.

భూమి క్రింద పూర్వం ఏం జరిగింది,ఇప్పుడు ఏం జరుగుతోంది:తెలుసుకుందాం...ఫోటోలు

టెక్టోనిక్ ప్లేట్లు ఒక సైన్స్ సిద్దాంతం.భూమి యొక్క కఠినమైన భాహ్య పొర లితోస్పెయర్,రెండు భాగాలుగా విరిగినది,వాటిని టెక్టోనిక్ ప్లేట్లు అని అంటారు. ఈ ప్లేట్లు కఠినమైనవి,అవి ఒక దానితో మరొకటి జతగా కదులుతాయి.

ఈ టెక్టోనిక్ ప్లేట్లు అనే సిద్దాంతం ఈ మధ్య వచ్చినది. అంటే 1960 లో భూగర్భ శాస్త్రవేత్తలు సముద్ర పరిశోధనలు చేస్తూ మన కాళ్ళ క్రింద(భూమి క్రింద)ఏమి జరుగుతోందో తెలుసుకున్నారు.



భూమి యొక్క ఉపరితలం వరుసక్రమంగా పెద్ద పెద్ద ప్లేట్లతో నిర్మించబడి యున్నది.ఈ ప్లేట్లు నిరంతరంగా కదులుతూ సంవత్సరానికి కొన్ని సెంటీమీటర్లు(మధ్యలో విస్తరిస్తూ, చివర్లలో కుంగిపోతూ) జరుగుతోంది.

200 వందల మిల్లియన్ సంవత్సరాల క్రితం ఇప్పుడున్న అన్ని ఖండాలూ ఒకటిగా కలిసి ఉండేవి. అప్పుడు ఒకే ఖండంగా పాంగియా సూపర్ కాంటినెంట్ అని పిలువబడేది.

మొట్టమొదట ఈ ఖండం రెండుగా విడిపోయింది. ఒకటి లౌరేసియా...ఉత్తర భూగోలం. మరొకటి గాండ్వానా... దక్షిణ భూగోళం.

150 మిల్లియన్ సంవత్సరాల క్రితం జూరాసిక్ యుగంలో భూమి ఇలా ఉండేదట.

94 మిల్లియన్ సంవత్సరాల క్రితం క్రెటాసియస్ యుగంలో భూమి ఇలా ఉండేదట.

భూమి క్రింద యున్న టెక్టోనిక్ ప్లేట్లు నిరంతరం కదులుతూ ఉన్నందున రాబోవు కాలాలలో భూమి ఇలా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.



భూమి క్రింద ఉన్న ఘనమైన ఈ బండలు(ప్లేట్లు) ఎలా కదులుతున్నాయనేది ఊహించుకోవటం కఠినంగా ఉంది. ఈ బండలు ఎలా తోసుకు వెడుతున్నాయో అన్న విషయంలో శాస్త్రవేత్తలు సూచన కోసం పరిశోధించేరు.ఎంతో కాలంగా వారు చేసిన పరిశోధనలలో సముద్రం క్రింద వరుసగా కొండలు ఉండటం వారికి దొరికిన అతి పెద్ద క్లూ.

ఈ టెక్టోనిక్ ప్లేట్ల చివర్లలో జరిగే కదలికలే భూగోళం లో జరిగే కార్యకాలాపాలు. అవే భూకంపాలు, అగ్నిపర్వత పేళుల్లు మరియూ కొండల నిర్మాణం.